ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆ విషయం ఆయనకూ తెలుసు.. పార్టీ నుంచి వలసలు ఉంటాయని కూడా ఆయనకు తెలియందేమీ కాదు.. కానీ ఉన్నంతలో ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.


అయితే కొందరు నేతలు మాత్రం రాజకీయ దిగ్గజంగా పేరున్న చంద్రబాబునే కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు. పార్టీలో ఉంటారో.. ఉండరో తెలియనంతగా ఇబ్బంది పెడుతున్నారు. వారిలో కేశినేని నాని ఒకరు కాగా.. ఇంకొకరు వల్లభనేని వంశీ.


ఇప్పటికే కేశినేని నాని రోజుకో పోస్టుతో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన దారిలోనే వల్లభనేని వంశీ కూడా కనిపిస్తున్నారు. ఈయన ఏకంగా బీజేపీ మంత్రులను కలుస్తున్నారు కూడా. అయితే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన మాట వాస్తమేనని.. అంటూనే..టీడీపీలోనే కొనసాగుతానని చెబుతున్నారు.


అంతేకాదు.. ఇప్పటికే పార్టీని వదిలిపెట్టి వెళ్లిన ఎంపీ సుజనాచౌదరితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయంటున్నారు . మరోవైపు టీడీపీతోనే కొనసాగుతానని వంశీ తేల్చిచెబుతున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కన్ ఫ్యూజన్‌లో పడిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: