తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని మాయమాటలు చెప్పి అతడి ఇంటికి ప్రియురాలిని తీసుకెళ్లిన ప్రియుడు వారితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


 త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 


వీరిని బొబ్బిలి పృథ్వి, దలాయి శ్యామ్‌కుమార్, వి.సాయి, ఎన్‌.సాయికుమార్‌‌గా పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని, పరామర్శకు వెళ్దామని చెప్పి బాధితురాలిని ప్రియుడు పృథ్వి తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: