టీడీపీ అధినేత చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురైంది. తెలుగుదేశం సర్కారు తీరుపై మండిపడిన జనం ఆ పార్టీకి చరిత్రలోనే ఎరగనంత దారుణమైన ఓటమిని అందించారు. చంద్రబాబు కంటే జగన్ బెటర్ అని జనం తేల్చి చెప్పారు.


అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నెలన్నర రోజులైనా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాదు.. పాపం.. ఆయన్ను జనం ఎందుకు ఓడించారో కూడా గుర్తించలేకపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ది చేశానని, నీతి, నిజాయితీగా పాలన చేసినట్లు చంద్రబాబుప్రతిచోటా చెప్పుకుంటున్నారు.


మరి చంద్రబాబు నీతి నిజాయితీగా పాలన చేస్తే జనం ఎందుకు ఓడించినట్టు... చంద్రబాబు అద్భుతంగా ఏపీని అభివృద్ధి చేస్తే జనం ఎందుకు ఓడించినట్టు.. చంద్రబాబు రేయింబగళ్లు కష్టపడి రాష్ట్రం కోసం పాటుబడితే జనం ఎందుకు ఓడించినట్టు..


ఈ ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు సమాధానం వెదికే ప్రయత్నం చేయడం లేదు. చంద్రబాబు ఇంకా ఇలాగే మాట్లాడితే.. జనం నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టినట్టే అవుతుంది. జనం నాడి తెలుసుకోకుండా మొండిగా వెళ్తే ఏమవుతుందో మొన్నటి ఫలితాలే రుజువు చేశాయి. కానీ ఈ విషయం చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పేదెవరు..?


మరింత సమాచారం తెలుసుకోండి: