కాకతీయ రైలుకి ప్రమాదం తప్పింది... !
ఒక భారీ రైలు ప్రమాదం డ్రైవర్ ముందు చూపు వల్ల తృటిలో తప్పింది.
తెలంగాణలోని మహబూబాబాద్లో ఈ రోజు రైల్వే ట్రాక్ ధ్వంసం అయింది. అదే ట్రాక్ పై వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ రైలులోని, డ్రైవర్ ప్రమాదం కనిపెట్టి రైలును నిలిపి వేశాడు. రైల్వే సిబ్బంది ట్రాక్ని పరిశీలించగా కొంత మేర ధ్వంసం అయినట్టు గుర్తించారు.
ఐదు బోగీలతో వెళ్తున్న ప్యాసింజర్ కి ప్రమాదం తప్పినందుకు ప్రయాణీకులు ఊపిరి
పీల్చుకున్నారు.