తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక విద్య తెలుసు. అదే ఎదురు దాడి చేయడం. దబాయించడం. ఒకసారి కాదు, నాలుగైదు సార్లు చెబితే అదే నిజం అయిపోతుందన్నది వారి ప్రగాఢ నమ్మకం.  ఆ విద్యలో వారు ఆరితేరిపోయారు. ఇపుడు కూడా అదే వరస మరి.



ఇక విషయానికి వస్తే వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ టీడీపీ పరువు తీసి ఉతికి ఆరేశారు. అప్పులు ఇచ్చారని ఆయన దుయ్యబెట్టారు. దానికి టీడీపీ రిప్లై  ఇచ్చింది.  వరసగా తమ హయాంలో ఆంద్రప్రదేశ్ గా రెండు అంకెల అభివద్ది సాదించామని మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆర్డిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి విడుదల చేసిన వాస్తవపత్రంపై ఆయన స్పందించారు.రాష్ట్రంలో గతంలో తలసరి ఆదాయం రూ.93వేలు ఉండేదని.. దాన్ని 1.64లక్షలకు పెంచిన ఘనత తమదని ఆయన చెప్పారు.


వ్యవసాయ రంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పారని యనమల ఆరోపించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి ఉందని.. ఉద్యాన రంగంలోనూ మంచి వృద్ధిరేటు సాధించగలిగామని యనమల పేర్కొన్నారు.సేవా రంగం హైదరాబాద్ లో ఉండి పోవడం వల్ల నష్టపోయామని, లేకుంటే ఇంకా మెరుగ్గా ఉండేవారమని ఆయన అన్నారు. మొత్తానికి మాటకు మాట అయింది. అసలు నిజాలు దేముడికి ఎరుక.


మరింత సమాచారం తెలుసుకోండి: