తెలుగుదేశం పార్టీకి అధికారం పోయిందనే బాధలో ఎవరిని ఎం అంటున్నాడో అతనికే అర్థంకావటంలేదు కేశినేని నానికి. సోషల్ మీడియాలో అతను చేసే పోస్టులలో చంద్రబాబుని తిడుతున్నాడా ? పార్టీని తిడుతున్నాడా ? లేక అధికార పార్టీని విమర్శిస్తున్నాడా అనేదే అతనికే తెలియడం లేదు. చంద్రబాబుని సైతం ఆలోచించేలా చేస్తున్నాడు. 


ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ ఓడిపోయినందుకు ఇతను వైసీపీలో చేరడానికి ఆలా పోస్ట్ చేస్తున్నాడు ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఒకానొక సమయంలో నేను పార్టీ మారాను అని తేల్చి చెప్పడంతో తెలుగు తమ్ములు కొంచం ఉపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ లో సరికొత్త ట్విట్ పెట్టి ట్విట్టేష్ షాక్ గురయ్యేలా చేశాడు.


ప్రతిపక్షాన్ని అంటున్నట్టు ఉన్న ట్విట్టేష్ బాబు నారా లోకేష్ గురించే ఈ ట్విట్ పెట్టినట్టు అనిపిస్తుంది. అది చదివితే మీరు కూడా ఇదే మాట అంటారు. ఆ ట్విట్ ఇదే ''నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, Tweet చేస్తున్నాడు. దౌర్భాగ్యం!'' అంటూ ట్విట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు ఈ ట్విట్ పక్క 'ట్విట్టర్ పిట్టా నారా లోకేష్'కే అంకితం ఇచ్చారు అని సెటైర్లు వేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: