ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జేట్ సమావేశాలు సోమవారం కూడా యధావిథిగానే కొనసాగాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రాష్ట్రంలో కొత్త సర్కిల్‌ స్టేషన్ల అవశ్యకతపై ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చి శిథిలావస్థలో ఉన్న స్టేషన్లను పునర్నించాలని పలువురు సభ్యులు కోరారు.

నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమ నియోజకవర్గాల్లో శిథిలావస్థకు చేరిన స్టేషన్ల పరిస్థితిని సభ దృష్టికి తెచ్చారు. నియోజవర్గానికి ఒక సర్కిల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పలువురు సభకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు రాష్ర్ట హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్‌ స్టేషన్లు నిర్మించడం పూర్తైందని, వాటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంకా ఐదు స్టేషన్‌లు నిర్మాణం పూర్తి కావడానికి దగ్గర్లో ఉన్నాయి. మరో 12 సర్కిల్స్‌ స్టేషన్ల ప్రపోజల్స్‌ ఉన్నాయి. ఇంకా సభ్యులు చెప్పిన ప్రపోజల్స్‌ తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు నగరాల్లో సర్కిల్‌ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని సూచరిత వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: