ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు పంజా విసురుతున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో అపహరణకు గురైన తెరాస ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌రావు హత్యకు గురయ్యాడు. ఎర్రంపాడు- పుట్టపాడు మార్గంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బెస్తకొత్తూరు ఎంపీటీసీని మావోయిస్టులు ఈ నెల 8న రాత్రి అపహరించిన ఘటన దండకారణ్యంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్గఘటన మరువక ముందే..మరో సారి మావోలు పంజా విసిరారు. 

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసుల కోసం ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి సత్తిబాబు, భాస్కరావు, లింగరాజును ఇళ్లకు వెళ్లి వారిని బయటకు రావాల్సిందిగా కోరారు. వారు బయటకు రాగానే బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా సత్తిబాబు, భాస్కరరావులు పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. తాము ఇన్ ఫార్మర్లం కాదని చెప్పినా వినకుండా వారిద్దరినీ అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం మరో గిరిజనుడు లింగరాజును తీవ్రంగా కొట్టి వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో గాలింపును ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: