తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే.  రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులయ్యారు. నేడు ఆయన తన స్వగ్రామమైన సిద్ధిపేట రూరల్ మండలంలోని చింతమడకు వెళ్లిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా తన బాల్య స్నేహితులను..చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  తన గెలుపు కోసం ఆరాటపడుతున్న తన సొంత గ్రామ ప్రజలను కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా చింతమడకపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

గ్రామంలోని ప్రతి ఇంటికి రూ. 10 లక్షల చొప్పున సాయం అందేలా పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. దీని కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. చింతమడక హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని... గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.  అంతే కాదు ఈ ఊరిలో సొంత ఇల్లు లేదు అన్న మాట ఉండకూడదని అందుకోసం చింతమడకకు 1500 నుంచి 2వేల వరకు ఇళ్లను మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆరు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి, అర్హులకు అందజేస్తామని తెలిపారు.

కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పారు.కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. తన స్వగ్రామానికి తాను ఎంత చేసినా తక్కువేనని అన్నారు.చింతమడక హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని... గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. చింతమడక, మాసాపూర్, సీతారాంపూర్ గ్రామాల్లోని 2 వేల కుటుంబాలకు ఉచితంగా కంటి, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలోని అభివృద్ది పనులు మూడు, నాలుగు నెలల్లో పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: