అసెంబ్లీ సమావేశాలు అంటే ఎప్పుడు గొడవలతో వాదనలతో  వాయిదాలతో కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.కానీ తాజాగా జరిగిన ఒక సన్నివేశంతో అసెంబ్లీ అంతా నవ్వులతో నిండిపోయింది.వివరాల్లోకి వేల్తే జోరుగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నవ్వుల జల్లు కురిపించారు.


వైసిపి అభిమానం చూస్తుంటే తనకే ఆశ్చర్యమేసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఏపీ తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది ప్రతిపక్షాల నుంచి టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడన అనంతరం చంద్రబాబునాయుడిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ కోరారు, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై చంద్రబాబు సెటైరికల్ గా కామెంట్లు చేశారు.


తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిన్న అసెంబ్లీ ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే వైసీపీకి తన పై చాలా అభిమానం ఉన్న ఉన్నట్లుందని ఎంత అభిమానం అంటే అది చూసి తనకే ఆశ్చర్యమేస్తోందని వ్యాఖ్యానించారు. మార్పు చాలా వచ్చింది చాలా సంతోషంగా ఉంది అని చంద్రబాబు అనడంతో సభ ఒక్క సారిగా నవ్వుల్లో మునిగిపోయింది ఆయన మాటలకు సీఎం జగన్ కూడా హాయిగా నవ్వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: