భారత్  ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య బలమైన మిలిటరీ సంభందాలు ఉన్నాయి. ఇండియా ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా .. ఇజ్రాయెల్ ను మాత్రం ఖచ్చితంగా నమ్ముతుంది. పైగా భారత్ ఆంటే ఇజ్రాయెల్ కు ఎనలేని ఇష్టం ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు. ఇజ్రాయిల్ లో యూదులు ఎక్కువగా ఉన్న సంగతీ తెలిసిందే. ఆనాడు యూదులకు భారత్ ఆశ్రయం ఇవ్వటం వల్ల వారంతా తరువాత ఒక దేశంగా ఏర్పడిన తరువాత భారత్ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయిలీ పౌరుడు జీవితంలో ఒక సారైనా భారత్ ను సందర్శించాలని కలలు కంటాడు. అందుకే భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎనలేని గౌరవం, అభిమానం.


ఇజ్రాయిల్ భారత్ నుంచి ఏమి ఆశించని గొప్ప మిత్ర దేశం. మిగతా దేశాలు రష్యా, అమెరికా తమ స్వార్ధ ప్రయోజనాలును చూసుకుంటుంది గాని నిజమైన మిత్ర దేశాలుగా మెలగవు. ఇజ్రాయిల్ అత్యాధునిక మిలిటరీ వ్యవస్థ ఉన్న దేశం. ప్రపంచంలోనే అతి శక్తి వంతమైన ఇంటెలిజెంట్ విభాగం మసూద్ ..  ఇజ్రాయిల్ దేశం స్వంతం. ఇంటెలిజెంట్ విభాగంలో అమెరికా నిఘా వ్యవస్థ కూడా మసూద్ తరువాతే నని చెప్పాలి. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కూడా మోడీ బొమ్మతో ఎన్నికలకు వెళ్లాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లో భారత్ దేశం మీద ఎంత ప్రేమ ఉందో !


అయితే కేంద్రం కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని రద్దు చేసిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం మీద ప్రపంచ దేశాలు పలు రకాలుగా స్పందించాయి. కానీ ఇజ్రాయిల్ మాత్రం నిజాయతీగా దమ్మున్న స్టేట్ మెంట్ ఇచ్చింది. కాశ్మీర్ పై నిర్ణయం అనేది భారత్ అంతర్గత నిర్ణయమని, అందులో పాకిస్తాన్ కు ఎటువంటి సంభందం లేదని తేల్చి చెప్పింది. ఇంకా చెబుతూ ఒక వేళ భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర స్థావరాలను నిర్ములించడానికి వెళితే మేము కూడా తోడు వస్తామని చెప్పడంతో పాకిస్థాన్ నివ్వెర పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: