ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ పై ట్విట్టర్ వేధికగా అతను చేసిన ట్విట్లపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఎప్పుడు ఏదొక విధంగా దొరికిపోయే లోకేష్ ట్విట్టర్ వేధికగా మళ్ళి అడ్డంగా బుక్ అయ్యాడు. 


తెలుగుపై కనీస అవగాహనా కూడా లేని మనిషికి తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కట్టబెట్టారు, ఇప్పుడు అది లేదు అని ఎలా ట్విట్ చేస్తున్నాడో చుడండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉదయం నుంచి నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ప్రజలను రెచ్చగొట్టడానికి ట్విట్ చేస్తూ డ్రామా ఆడుతున్నారు. 


ఈ నేపథ్యంలోనే వరద దెబ్బకి మునిగిపోయిన పడవను వీడియో తీసి 'చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి  బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?' అంటూ ట్విట్ చేశారు ట్విట్టేష్.                                                       


ఈ ట్విట్ కి స్పందిస్తున్న నెటిజన్లు 'పడవ ఏమో గానీ, మిమ్మల్ని అడ్డంగా పడుకోబెడితే మాత్రం ఏమైనా జరగొచ్చు..! జోకులు మాని.. చిల్లు గారెలు తింటూ, మల్లెపూల వాసన చూస్తూ.. వెనక సైజులు ఎలా పెంచుకోవాలో అని ఆలోచించే పనిలో ఉండండి సామీ..! అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. వాళ్ళు అంత ఫైర్ అయినప్పటికీ లోకేష్ మాత్రం ఆగకుండా ట్విట్ల మీద ట్విట్లు చేస్తూనే ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: