రాష్ట్రంలో డ్రోన్ల రాజకీయం ఇప్పుడు తెగ హీట్ రేపుతోంది. అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇంటి మీద కావాలనే కుట్రతో ప్రభుత్వం నిఘా పెట్టిందని టీడీపీ ఆరోపిస్తుంది. మాజీ ఇరిగేషన్ మంత్రి ఉమా మహేశ్వర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి .. ప్రభుత్వం కృతిమంగా వరదను సృష్టించి చంద్రబాబు ఇల్లును మునిగేలా చేసారని చెప్పుకొచ్చారు. అయితే కృతిమంగా వరదను ఎలా  సృష్టిస్టారో ఆయనే చెప్పి ఉంటే బాగుండేది. చంద్రబాబు ఇల్లు కృష్ణ నదిని అనుకునే ఉంది. అలాంటప్పుడు అన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లుకు ముంపు సహజం. కానీ టీడీపీ వితండవాదం చేస్తుంది. 


అయితే ఉమా వ్యాఖ్యలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అదిరిపోయే సెటైర్ వేశారు. సిగ్గులేకుండా ఇంకా అక్రమ కట్టడంలో ఉంటూ టీడీపీ నేతలు దిగజారి పోతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూడా ఇల్లు కోసం ధరఖాస్తు చేసుకుంటే .. ప్రజలతో పాటు ఆయనకు కూడా వచ్చే ఉగాది లోపల ఇల్లు పట్టాను ఇస్తామని వ్యగ్యంగా సమాధానం చెప్పారు. అయితే ఇప్పటికే అయితే ఇదే విషయం మీద మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.


ఈ డ్రోన్లను గత మూడు రోజులు నుంచి ప్రభుత్వమే పెట్టిందని .. వరద ముప్పును అంచనా వేయడానికే మాత్రమే ఉపయోగిస్తున్నామని .. కానీ టీడీపీ అనవసర డ్రామాలు ఆడుతుందని అనిల్ కుమారు ఫైర్ అయ్యారు. ఎగువ ప్రాంతంలో భారీ గా వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజి కు మరింత వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రతగా డ్రోన్లతో అంచనా వేస్తున్నామని చెప్పారు. సాధారణ ప్రజలను ఎలాగైతే కాపాడాలో.. రాష్ట్ర ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అలాగే కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిది. కానీ దానిని కూడా తప్పు అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులూ. దీనితో ఇప్పుడు ఈ వివాదం తార స్థాయికి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: