కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి,TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.కొన్నాళ్ల క్రితం మాటల యుద్ధం చేసి సడెన్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిన రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చాక తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. భారతీయ జనతాపార్టీ  జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా,తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచు కుంటోందని చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే.




ఈ అంశంపై విజయశాంతి స్పందిస్తూ తండ్రిమాటను జవదాటని రాముడిలా వున్న తారకరామరావుగారు మీరు నోరుజారే ముందు మీ తండ్రిగారి అనుమతి తీసుకొనే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమని.ఆ సంస్థకు కొంతమంది పెద్దలతో సబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు గతంలో ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్‌ ఇదే మాదిరి సవాల్‌ విసిరారని ఆమె ఎద్దేవా చేశారు. కలకలం రేపిన విద్యార్దుల ఆత్మహత్యలపై నేతల ఫిర్యాదుతో స్పందించిన రాష్ట్రపతి ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు విజయశాంతి ..



ఇక కేసీఆర్,ప్రతిపక్షాలు తనపై కుట్రచేస్తున్నాయని గగ్గోలు పెడుతు విమర్శించే ముందు తన తనయుడు కేటీఆర్ ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్ అడిగితే బాగుంటుందని రాములమ్మ అభిప్రాయడ్డారు..ఇక కొసమెరుపేంటంటే విజయశాంతి మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు,కొంత కాలంగా రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న ఈమె,చాలా ఏళ్ల గ్యాప్ తర్వా మళ్లీ ముఖానికి రంగులు వేసుకుని,సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న‘సరిలేరు నీకెవ్వరూ’చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: