ఈ మద్య కొంత మంది యువకులు రోడ్డుపై వెళ్తున్న యువతులను, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం..మాట్లాడటం చేస్తున్నారు.  పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడో అక్కడ ఇలాంటి పోకిరీలు చెలరేగిపోతూనే ఉన్నారు.  ఇక మహిళలపై జరుగుతున్న అకృత్యాలు రోజూ వార్తల్లో చూస్తున్నాం..చదువుతున్నాం.  ఈ మద్య కొంత మంది కామాంధులు ఏకంగా చిన్నారులపై అత్యాచారాలు చేస్తూ చంపేస్తున్నారు.  మరీ దారుణం ఏంటేంటే అంధులు, అంగవైకల్యం ఉన్న అమ్మాయిలను కూడా వదలడం లేదు. దేశంలో ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతన్నాయని వార్తలు వస్తున్నాయి. 


ప్రభుత్వాల ఇలాంటి కామాంధులకు కఠిన చట్టాలు విధించకపోవడ వల్లనే ఇలా చెలరేగిపోతున్నారని మహిళా సంఘాలు, సామాజిక కార్యక్తలు ఆరోపిస్తున్నారు.  అయితే ఇటీవల హన్మకొండలో ఓ తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసిన ఘటనలో ఆ నింధితుడి ఉరిశిక్ష విధించింది వరంగల్ కోర్టు.  ఆ తీర్పుపై ఎంతో మంది సంతోషించారు..ఇలాంటి దుర్మార్గులకు తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.  అయితే మరో నింధితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కి కూడా ఉరిశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 



తాజాగా సికింద్రబాద్ లో ఓ యువకుడు అమ్మాల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. తిట్టడం లాంటి చేశాడు. మద్యం మత్తలు ఉన్న ఆ యువకుడు రోడ్డు పై వెళ్తున్న అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడటం చిరాకు పుట్టించేలా చేయడం చేయడంతో భయపడిన అమ్మాయిలు అటూ ఇటూ పరుగులు పెట్టారు. అయితే అమ్మాయిలపై ఇంకా ఏదైనా అఘాయిత్యానికి పాల్పపడతాడా అన్న భయంతో స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. అతను చేసిన తప్పు గురించి చెప్పడంతో వారిపై కూడా తిరగబడ్డాడు ఆ యువకుడు... దాంతో యువకుడిని గమనించి స్థానికులు దేహశుద్ది చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: