వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. నారా కుటుంబం అంటే వరుణుడికే కాదు వరదలకు భయమే అని సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.        


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే. ముంపు ప్రాంతాలను పర్యటిస్తామని సార్ ప్రకటించిన వెంటనే వరద నిలిచి పోయింది. అన్ని డ్యాముల గేట్లు మూతపడ్డాయి. ఇంతకూ ఈయన పరామర్శించేదెవరినో? మీ ఇల్లే మునిగి పోయిందట. ఇక మాకేం ధైర్యం చెబ్తారయ్యా అని బాధితులంతా ఈయననే ఓదార్చేట్టున్నారు.' అంటూ సంచలన ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి నెటిజన్లు స్పందిస్తూ మర లోకేష్ కౌంటర్ ఇచ్చారు 'వర్షం ఎక్కడ పడినా వరద వచ్చేది ఆ నదికే పప్పుగాడి అనుచరులకు ఆమాత్రం జ్ఞానం కూడా లేదు. బోల్లోడు ఉంటే పక్కరాష్ట్రాల్లో కూడా సరియిన వర్షాలు పడని దుస్తితి. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక లంక గ్రామాలు వరదలో మునగడం మామూలే ఇదేదో ఎప్పుడూ జరగనట్లు మాట్లాడడం తెలుగుదొంగలకే తెలుసు' అంటూ ట్విట్ చేస్తున్నారు. 


మరి కొందరు స్పందిస్తూ మీరు ఇచ్చే కౌంటర్లకు చంద్రబాబు నాయుడు హాస్పిటల్ పాలైన అవుతాడు. జెర జాగ్రత్త అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు స్పందిస్తూ 'యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి చూడలేకా దొంగా పనులు చేస్తున్నారు లెండి సాయి గారు' అంటూ ట్విట్ చేస్తున్నారు మరి ఈ ట్విట్లకు నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: