ట్విట్ యుద్ధం వీరుడు.. తెలుగు దేశం పార్టీ ధీరుడు, చంద్రబాబు నాయుడు సేవకుడు బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డిపై ఘాటు విమర్శ గుప్పించారు. గతంలో కేశినేని నానితో గొడవ పడినప్పటి నుండి ఫేమస్ అయినా బుద్ధా వెంకన్న రోజుకో ట్విట్ చేస్తున్నాడు. కేశినేని నాని అన్నట్టు నాలుగు అక్షరాలు కూడా రావు అనేది గుర్తు చేస్తున్నారు బుద్ధా వెంకన్న అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. 


విజయసాయి రెడ్డి గారు మోడీ, అమిత్ షాని చూసి ప్యాంటు తడుపుకుంటున్నది ఎవరో..  మోడీ గారు తిరుపతి పర్యటనలో ప్రజలంతా చూసారు. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు నడుం వంచి కాళ్లు పట్టుకుంటున్న మీరు కూడా ధైర్యం గురించి మాట్లాడితే ఆ ధైర్యానికి కూడా దరిద్రం పట్టుకుంటుంది. దరిద్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్ అని మీ ప్రభుత్వ వెబ్ సైట్ లొనే ఉంది చూసుకోండి. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా రాష్ట్రంలో వర్షం లేదు. వరదని రాజకీయం చెయ్యాలని వేలుపెట్టి రాయలసీమ రైతులకు చుక్క నీరు లేకుండా చేసావు. అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ బుద్ధా వెంకన్నను అమ్మనా బూతులు తిట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ 'నీకు కేశినేని నాని ఏ కరెక్ట్. బుద్ధి లేని బుద్ధా వెంకన్న' అంటూ ట్విట్ చేస్తే.. మరికొందరు స్పందిస్తూ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ గురించి ప్రస్తావించారు. 'అయ్యా..కోడెల గారి ఫర్నిచర్ దొంగతనం గురించి తమరు మాట్లాడితే వినాలని ఉంది. ఎంతసేపు పచ్చ ప్రగల్భాలు తప్ప మరేమీ రావా మీ నోట?' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ల బుద్ధా వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: