ఐఎన్ఎక్స్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. దీనితో 24  గంటలు అజ్ఞాతవాసంలోకి పోయిన చిదంబరం దిల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కనిపించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్  నమోదు అయినంత మాత్రానా తప్పు చేసినట్టు కాదని చెప్పి అనంతరం జోర్బాగ్లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్ అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు.


సీబీఐ ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తి గత సిబ్బంది సీబీఐ ఆఫీసర్స్ ను అడ్డుకొని గేట్లు వేశారు. దీంతో సీబీఐ సిబ్బంది గోడదూకి లోపలికి ప్రవేశించి ఢిల్లీ పోలీసుల సహాకారంతో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. అయితే చిదంబరం అరెస్ట్ వెనుక అమిత్ షా ఉన్నాడని క్లియర్ గా అర్ధం అవుతుంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను అరెస్ట్ చేయించడం .. మళ్ళీ ప్రత్యర్ధులు అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయ కక్ష తీర్చుకోవటం మనం చూస్తున్నాము. ఇటువంటి రాజకీయాలు అలవాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. 


అయితే కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి .. జైల్లో వేయించారు. దీనితో అమిత్ షా ఇప్పుడు అధికారంలో ఉండటంతో అది కూడా కీలకమైన హోమ్ మినిస్టర్ హోదాలో ఉండటంతో చిదంబరంను అరెస్ట్ చేయించి ప్రతి కారం తీర్చుకున్నాడని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: