చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు. ఆలా చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను దర్యాప్తు సంస్థల సహకారంతో జైల్లో పెట్టించి వేధించేవారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ను కూడా అలానే టార్గెట్ చేసి 16నెలలు జైల్లో పెట్టించారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నదో వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ నామరూపాలు ఏపీలో లేకుండా చేశారు జగన్. కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో అటు ఏపీలో లేకుండా పోయింది. తెలంగాణ కనీసం పార్టీ బతికి ఉంది. ఏపీలో సమూలంగా పాతాళంలోకి వెళ్లి పోయింది. 


అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ .. కాంగ్రెస్ కు చుక్కలు చూపేందుకు సిద్ధం అయ్యింది. బీజేపీ మొదటి పర్యాయం గెలిచినప్పుడు ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులకు దూరంగా ఉన్నది. కానీ రెండవ సారి భారీ మెజారిటీ రావటంతో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఘోర స్థితిలోకి తీసుకురావటనికి అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటీకే కాంగ్రెస్ సీనియర్ నేత .. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే ఈయన గారు అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేశారు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: