ఆది నారాయణ రెడ్డి 2014 లో వైసీపీ తరుపున పోటీ చేసి కొన్ని నెలలకే టీడీపీ పార్టీలోకి దూకేసి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు. అయితే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది ఫిరాయించిన మనకు ఆది నారాయణ రెడ్డి మాత్రం మనకు గుర్తుకు వస్తారు. ఎందుకంటే జగన్ మీద ఘోరంగా విరుచుకుపడిన నేతల్లో అది నారాయణ రెడ్డి ఒకరు. చంద్రబాబు మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చి జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. చాలా సార్లు తన స్థాయిని దాటి జగన్ ని విమర్శించేవారు. టీడీపీలో మంత్రి పదవిని కూడా దక్కించుకోవటంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో అది నారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 


ఇక టీడీపీ పార్టీ అయితే నామరూపాలు లేకుండా పోయింది. ఇక కడపలో అయితే టీడీపీ జెండా ఎగరకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆది నారాయణ రెడ్డి బయటికి కూడా రావటం లేదు. మీడియా ముందుకు కనిపించడం లేదు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. కడపలో తన వ్యాపారాలు తాను చూసుకుంటూ కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే ఆది నారాయణ రెడ్డి బీజేపీలో మారడానికి ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. 


బీజేపీ కూడా రాయలసీమ మీద కన్ను వేసింది. రాయలసీమలో టీడీపీ పార్టీకి హేమా హేమీలు ఉన్నారు. ఒక పక్క అనంతపురంలో జేసి బ్రదర్స్ .. పరిటాల ఫ్యామిలీ .. కర్నూల్ లో భూమా ఫ్యామిలి .. ఇక కడపలో అది నారాయణ రెడ్డి. వీరందరి మీద బీజేపీ బాగా ఫోకస్ పెట్టింది. కానీ ఒక్క అది నారాయణ రెడ్డి తప్ప మిగిలిన వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. అది నారాయణ రెడ్డి .. బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ నడ్డాతో భేటీ అవ్వటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు అది నారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: