లేనిదే ఉంది అని చెప్పడం. అబద్దాన్ని నిజం చేయడం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇవన్నీ వెరసి టీడీపీ హయాంలో ప్రజలకు చంద్రబాబు మీద ఆ పార్టీ మీద చిరాకు, కసి అన్నిటినీ తెప్పించింది. అందుకే జనాలు చారిత్రత్మక తీర్పును ఇచ్చారు. టీడీపీ మారకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిరూపించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రజలను ఘోరంగా మోసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇది సోషల్ మీడియా లేని పాత రోజులు కాదు కదా ! ఏది దాచిన వెంటనే సోషల్ మీడియాలో దొరికిపోతారు. రాజమౌళి మహాస్మతి అనే రాజ్యాన్ని ఎలా సృష్టించారో చంద్రబాబు అమరావతి అనే రాజ్యాన్ని సృష్టించారు. 


 నిజంగా ఆ ప్రపంచం అనేది మనకు కనిపించదు. ఇప్పుడు అదే మాదిరిగా తయారైంది. ఏపీ కలలు రాజధాని అమరావతి. గత ఐదేళ్లలో అమరావతి ఇలా ఉందని .. ఒక కొత్త ప్రపంచాన్ని పత్రికల్లో బాబుగారు చూపించారు. పచ్చ మీడియా కూడా అమరావతి గురించి లేనివి .. ఉన్నవి అన్నీ చూపించింది. కానీ ఇప్పుడు రియల్ అమరావతిని చూస్తే అందులో ఏమి లేదు. ఐదారు బిల్డింగ్స్ తప్పితే చెప్పుకోడానికి ఏమి లేకుండా పోయింది. ఐదేళ్లు తన పరిపాలనలో చంద్రబాబు అమరావతి అంటూ ఎన్నెన్నో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తల్లో రోజుకో జిమ్మిక్ చేసేవారు.


కానీ ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: