కోడెల శివప్రసాద్ టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేశారు.అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో .. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ ఊరికినే అనలేదు. అవినీతిలో ఏపీ నెం .1. అని.  ఏకంగా ఫర్నిచర్ ను దొంగిలిస్తుంటే ఇంకేమి అనాలి. 


అయితే ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉండదు. చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదంటే .. బాబు గారికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అందుకే టీడీపీ కనీ వినీ ఎరుగని రీతిలో ఓటమి పాలైంది. బాబు గారికి ఇన్ని కనిపిస్తున్న మళ్ళీ ప్రజల దగ్దరికి వచ్చి నేనేం తప్పు చేసానో చెప్పండి అంటుంటే వీళ్ళను ఏమనాలో అర్ధం కావటం లేదు. అయితే కోడెల దొంగతనం చేసిన ఫర్నిచర్ విలువ సుమారు 65 లక్షలు. 


అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఫర్నిచర్ ను తమ కుటుంబ వ్యాపారల్లోకి తరలించారు. ఇప్పుడు ఇవన్నీ తమ హోండా కంపెనీ షోరూంలో ఎంచక్కా ఉపయోగిస్తున్నారు. చివరికి ఫర్నిచర్ ను కూడా వదలని దరిద్రమైన కక్కుర్తి ఒక్క కోడెలకు మాత్రమే సాధ్యమేమో .. అయితే ఇప్పటికే కోడెల వల్ల టీడీపీ పరువు కూడా గంగలో కలిసి పోయింది. ఎక్కడ నోరు విప్పితే తాము కూడా జనాల్లో పలచన పడిపోతామేమో నని .. చంద్రబాబు గాని లోకేష్ గానినోరు తెరవడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: