పెళ్లికాక ముందు నా భర్త ఇలా వుండాలి అలా వుండాలి అని కలలు కంటారు ఆడపిల్లలు,పెళ్లైయ్యాక ఎలావున్న సర్దుకు పోతారు దాదాపుగా ఇదే జరుగుతుంది ఎక్కడో ఒక్కచోట మొండి ఘటాలు తప్పా,ఇక భర్తంటే భార్యను తనలో అర్ధ భాగాంగా భావించి కంటికి రెప్పలా సాకాలి.ఎందుకంటే కన్నెపిల్లలా మెట్టినింట అడుగుపెట్టి కోడలిలా,భార్యగా తన బాధ్యతను సక్రమంగా  నిర్వ హిస్తూ  ఆ యింటి వంశాలకు అంకురార్పణ చేస్తుంది.అప్పటివరకు ఇద్దరిగా వున్న ఆజంటమధ్యలో ఎంతమందైనా పిల్లలు రావొచ్చు అది వాళ్ల స్దాయిని బట్టి వుంటుంది.ఇలా ఓ కూతురిగా పుట్టి అన్ని రకాల పాత్రలు సక్రమంగా పోషించి చివరికి మరో కూతురికి,కొడుకుకు తల్లిగా కన్ను మూస్తుంది.ఈ బాధ్యత అంతా భార్యదేనా అంటే భర్తది కూడా వుంది.అందుకే భార్యభర్తలను అర్దనారీశ్వరులుగా చెబుతారు..



కాని ఈ కాలంలో మూడు ముళ్ల బంధమంటే మూడు రాత్రుల ముచ్చటగా మిగిలిపోతుంది.అందుకే విలువ లేకుండా పోయింది పెళ్ళికి..ఇదంతా ఎందుకు చెబుతు న్నానంటే ఈ మధ్య మగాళ్లు కట్టుకున్న దాన్ని ఎలా వదిలించు కోవాలి,ఎలా చంపాలి లాంటి ప్లాన్స్ చాలా వేస్తున్నారు,మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అలానే తయారయ్యారు.ఇక్కడ ఓ మగాడు పెళ్లన్ని మమూలుగా చంపితే కిక్కెక్కడుంటుందనుకున్నాడో ఏమో వైరటి ప్లాన్ వేసాడు అదెక్కడో చూద్దాం.



కృష్ణా జిల్లా నందిగామ మండలంలో నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త.నందిగామ మండలం అంబారుపేటకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి తన భార్య అరుణ నిద్రిస్తున్న సమయంలో కరెంటు షాక్‌ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు.బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొని వస్తున్నారని గ్రహించిన జానకిరామయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అరుణను నందిగామలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.ఆమె పరిస్దితి కాస్త విషమంగానే వుందని ప్రస్తుతం సృహలో లేదని డాక్టర్స్ తెలిపారట..

మరింత సమాచారం తెలుసుకోండి: