గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఏపీ పౌరసఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.  అయితే కొడాలి నాని ఏపీకి మంత్రిగా వ్యవహరిస్తుంటే గుడివాడలో ఓ వ్యక్తి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారంటా. ఇక ఈ షాడో మంత్రి ఆగడాలు మితిమీరిపోయాయని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్‌ మీడియా సాక్షిగా ఫైర్ అయ్యారు.


గత టీడీపీ ప్రభుత్వం గుడివాడలో 9 వార్డులో బీసీ వర్గాలు ఏదైనా శుభకార్యాలు చేసుకోడానికి కఠారి సత్య నారాయణరావు స్మారక కమ్యూనిటీ హాలును నిర్మించారు. అయితే ఈ హాలు అశుభకార్యంతో ప్రారంభమవ్వడానికి షాడో మంత్రే కారణమని కఠారి ఆరోపిస్తున్నారు. ఇక అశుభకార్యం జరిగేటప్పుడు తానే స్వయంగా హాలుకు తాళం వేస్తే తనపై కేసు పెట్టకుండా షాడో మంత్రి సూచించిన వారిపై కేసు పెట్టారని మండిపడ్డారు.  


పైగా మున్సిపల్ అధికారులు కూడా షాడో మంత్రి చెప్పినట్లే వింటున్నారని, ఆయన చెప్పిన వారికే కమ్యూనిటీ హాలుని అద్దెకు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఆ షాడో మంత్రి గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఏ అధికారైన తన మాటే వినాలని ఆర్డర్లు వేశారని అన్నారు. అయితే ఆ షాడో మంత్రిపై కొడాలి నాని చర్యలు  తీసుకోవాలని, సొంత పార్టీ వాడని వదిలేస్తే పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని హితవు పలికారు. 


అలాగే షాదీఖానా నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దానిపై దర్యాప్తు చేయించాలని కఠారి డిమాండ్ చేశారు. అయితే కఠారి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు గుడివాడ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొడాలి నాని అంటేనే ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. అలాంటి నేత‌ను టార్గెట్‌గా చేసుకుని కొఠారి చేసిన వ్యాఖ్య‌ల‌తో అంద‌రూ షాక్ అవుతున్నారు.  ఆ షాడో మంత్రి పేరు చెప్పకుండా విమర్శలు చేయడంతో...అందరూ ఆ షాడో నేత ఎవరని ఆరా తీసే పనిలో పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: