వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విధంగా ప్రతిపక్షాన్ని, ఆ నేతలని విమర్శిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఇదే పని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చంద్రన్నను టార్గెట్ చేస్తూ ట్విట్లు చెయ్యడం విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సుపుత్రుడుకు మెదడులో ఉండే చిప్ప దొబ్బింది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి.   


ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''చిత్తు చిత్తుగా ఓడిపోయి 3 నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా?  ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా? '' అంటూ ట్విట్ చేస్తూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.  


అయితే ఈ వ్యాఖ్యలు నెటిజన్లు స్పందిస్తూ ''సార్...బాబుగారి బాధ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకోసారి అమెరికా ట్రిప్ వెల్లోస్తే అన్నీ సెట్ అవుతాయి. సీబీఐ తన పని చేస్కొని పోయేదాకా బాబుగారు సైలెంట్ అయ్యేలా లేరు.! ఇసుక వల్ల ఏదో జరిగిపోయిందని తండ్రీ కొడుకులు గోల చేస్తున్నారు. వందల కోట్లు దోచుకొని సిగ్గు లేకుండా డ్రామాలు ఆడుతున్నారు.!'' అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు. మరి విజయసాయి రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: