టీడీపీ భవిష్యత్ నాయకుడని చెప్పుకునే లోకేష్ ఈ మధ్య ట్విటర్లో తెగ రెచ్చిపోయి కామెడీ అయిపోయారు. కృష్ణా నదిలో వరదలు వస్తే కావాలని వైసీపీ తమ ఇంటి మీదకు వరద నీటిని పంపించిందని చెప్పి ప్రజల్లో అభాసుపాలయ్యారు. అయితే జగన్ పాలన మూడు నెలలు కాక ముందే జగన్ ది తుగ్లక్ పాలన అని లోకేష్ సెలవిచ్చారు. దీనితో నెటిజన్స్ లోకేష్ ను ఒక ఆట ఆడుకున్నారు. మీ పరిపాలన అంత బాగుంటే ఎందుకు చిత్తుగా చిత్తుగా ఓడిపోయారని నెటిజన్స్ ఎదురు మొదలు పెట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ప్రజల్లో సింపతీని పొందడానికి తండ్రి కొడుకులు పడరాని పాట్లు పడుతున్నారు.


జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ట్విట్టర్ లో ఒకరు మించి ఒకరు కామెడీని పండిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు మైలేజీ తీసుకురావటం కాదు కదా జనాల్లో కమెడియన్స్  గా మార్చెస్తున్నాయి. ప్రజా వేదిక విషయంలో సింపతీని పొందాలని చూశారు కానీ అక్కడ కూడా సెల్ఫ్ గోల్ అయ్యింది. అక్రమ కట్టడం కూల్చడం కరెక్టే కదా అని మెజారిటీ జనాలు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు డ్రోన్ల మీద రాజకీయం చేయాలనీ చూశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది. 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.


మరింత సమాచారం తెలుసుకోండి: