2009 రాజకీయాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ అప్పట్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల్లో అయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రయాణంలో ఎంతో మందిని కలుసుకున్నారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ ను చూడగానే పెద్ద ఎన్టీఆర్ వచ్చినంత సంతోషపడ్డారు. చిన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే... అంతకంటే కావాల్సింది ఏముంది అని సంబరపడ్డారు.
అయితే, 2009 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓటమి తరువాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు. పార్టీలో జరిగే మీటింగులకు ఆయన్ను పిలవలేదు. కనీసం పట్టించుకోలేదు కూడా. దీంతో ఎన్టీఆర్ కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించింది. తెలంగాణాలో దారుణంగా పరాజయం పాలైంది. సరైన నాయకత్వం లేక తెలంగాణాలో విఫలం అయ్యింది.
అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు ఎన్టీఆర్ ను అధ్యక్షడిగా నియమించాలని, అప్పుడే తెలంగాణాలో పార్టీ మనుగడలోకి వస్తుందని అన్నారు. కానీ, అలా అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి. ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణను కూడా పక్కన పెట్టడంతో..బాబు కుట్ర బయటపడింది. అవసరం అనుకుంటూనే బాబు చేరదీస్తారు.. లేదంటే పట్టించుకోరని అర్ధం చేసుకున్నారు. ఎన్టీఆర్ కూడా అంటి నటనట్టుగా ఉన్నారు. అయితే, తాత స్థాపించిన పార్టీ కాబట్టి అవసరం అనుకుంటే వస్తానని గతంలో బాద్షా సినిమా సమయంలో చెప్పారు.
కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టిడిపి ఆంధ్రప్రదేశ్ లోను దారుణంగా ఓటమిపాలైంది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు చాలామంది అనుకున్నారు. బాబుతో ఈ విషయాన్ని సూత్రపాయంగా చెప్పారు కూడా. కానీ, బాబు దాన్ని పట్టించుకోలేదు. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా ఎన్టీఆర్ తో అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. తాజాగా, లోకేష్ ను ఎన్టీఆర్ రాజకీయాల గురించి అడిగితె.. వ్యక్తిగతంగా పార్టీ ఎవరకి సపోర్ట్ చేయదని, రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి పనిచేయొచ్చునని అన్నాడు. అంటే.. నీకు అవసరం ఉంటె పార్టీలోకి రావొచ్చు.. పార్టీకి నీ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. లోకేష్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అభిమానులు లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్నారు.