వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విధంగా ప్రతిపక్షాన్ని, ఆ నేతలని విమర్శిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేధికగా ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేసిన విషయంపై చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. 


ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు చరిత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు విజయసాయి రెడ్డి. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని, 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలోను సొంత మనుషుల కోసమే అరటా పడ్డాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. నెటిజన్లు కూడా ఈ ట్విట్స్ చూసి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడుతున్నారు.  


విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ''ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు నాయుడు గారిది. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడు.'' అంటూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు.   


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ ''చంద్రబాబు నాయుడు చాలా చీప్ సర్, అందుకే మేము తరిమేశాము'' అంటూ ట్విట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: