నారా లోకేష్ ఇన్ని రోజులు ట్విట్టర్లో రాజకీయాలు చేశారు. ఎక్కడ మీడియా ముందుకు వస్తే కామెడీ అయిపోతానమేనని లోకేష్ కు తెలుసు కాబట్టి ట్విట్టర్ లో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్ ను పార్టీ నాయకుడిగా ప్రాజెక్ట్ చేయడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. ఎన్నికలప్పుడు లోకేష్ బయటికి వచ్చి చేసిన కామెడీ షో ఇంకా అందరికి గుర్తున్నాయి. అయితే ఎన్నికలో ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ను చంద్రబాబు టీడీపీ లీడర్ గా ప్రాజెక్ట్ చేయడానికి .. ప్రజల్లోకి రుద్దడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడబోయి ఏం మాట్లాడతాడేమోనని టీడీపీ నాయకులూ కూడా జంకుతుంటారు.


అయితే లోకేష్ వారి భయాన్ని నిజం చేస్తూ మళ్ళీ నోరు జారారు. లోకేష్ మాట్లాడుతూ .. 'రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి రాక్షస రాజ్యాన్ని తెచ్చారు..' అంటూ చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ నోటి నుంచి రాజన్న రాజ్యం వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి పరిపాలనను మెచ్చుకున్నట్టే ..  ఈ వ్యాఖ్యలతో పక్కనే ఉన్న టీడీపీ నేతలకు ఒక్క సారిగా మైండ్ పోయింది. ఇది వైసీపీ పార్టీకి ఆయుధంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


అయితే లోకేష్ నోరు జారడం ఇది మొదటి సారి కాదు.  కృష్ణా నదిలో వరదలు వస్తే కావాలని వైసీపీ తమ ఇంటి మీదకు వరద నీటిని పంపించిందని చెప్పి ప్రజల్లో అభాసుపాలయ్యారు. అయితే మొన్న లోకేష్ .. జగన్ పాలన మూడు నెలలు కాక ముందే జగన్ ది తుగ్లక్ పాలన అని లోకేష్ సెలవిచ్చారు. దీనితో నెటిజన్స్ లోకేష్ ను ఒక ఆట ఆడుకున్నారు. మీ పరిపాలన అంత బాగుంటే ఎందుకు చిత్తుగా చిత్తుగా ఓడిపోయారని నెటిజన్స్ ఎదురు మొదలు పెట్టారు. దీనితో లోకేష్ మారడం కష్టమని పార్టీ నేతలే చెప్పడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: