వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా మరోసారి నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. 'విజయసాయి రెడ్డి సెటైర్ వెయ్యకపోతే చంద్రబాబు నాయుడు, లోకేష్ కి నిద్ర పట్టదు అనుకుంట.. అందుకే ఏదో విధంగా విజయసాయి రెడ్డిని గెలికి సెటైర్ వేపించుకుంటారు' అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు ట్విట్ చేస్తూ చంద్రబాబు నాయుడుపై సీరియస్ అవుతూ నారా లోకేష్ పై సెటైర్ వేశాడు విజయసాయి రెడ్డి. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''5 వేల వేతనంతో పని చేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు నాయుడు ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు?'' అంటూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి. 


ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ 'రూపాయికి పనికిరాని లోకేష్ కే పిల్లని ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి గ్రామా వాలంటీర్ కి పిల్లని ఎందుకు ఇవ్వరు విజయసాయి రెడ్డి అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కొందరు స్పందిస్తూ 'శుభాలు పలకటానికి వారికి మనసు రాదు .5 వేల రూపాయిల జీతానికి వచ్చిన దరఖాస్తులే చెప్పాయి వారి వైఫలాన్ని. అది తెలుసుకోకుండా, అంత మంది వాలంటీర్ల మనోభావాలను దెబ్బతీశారు. వారు వాలంటీర్లు అందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ఆలా చెప్పేవరకు అందరూ ఉద్యమించాలి సార్.' అంటూ మరికొందరు ట్విట్ చేశారు. మరి ఈ ట్విట్ కి చంద్రబాబు నాయుడు, మాలోకం ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: