ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే టీడీపీకి రాజీనామాలు చేసి మరీ వైసీపీలో దూకేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నేతలందరికీ అర్ధం అయ్యింది. పైగా చంద్రబాబుకు వయసు కూడా అయిపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టడం మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారందరు ఎందుకు పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. వైసీపీ తలుపులు తెరిస్తే చాలు ... వెంటనే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్  ఆ పని చేయడని తెలుసు కాబట్టి చంద్రబాబు నిర్భయంగా ఉన్నారు. అయితే నేతలు జంప్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో రాజీనామాలు చేసి మరీ పార్టీకి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.


దీనితో తెలంగాణ టీడీపీ మాదిరిగా ఒక్కరో .. ఇద్దరో ఎమ్మెల్యేలు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే   తూర్పు గోదావరి జిల్లా ప్రత్తి పాడు స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన వరుపుల రాజా గురువారం పార్టీకి రాజీనామా చేశారు. వరుపుల రాజా గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత. కానీ జగన్ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఆ తరువాత లిస్ట్ లో ..  మొన్నటి ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన ఆడారిఆనంద్ కుమార్ వైసీపీలో చేరబోతున్నాడని టాక్ ఊపందుకుంది.


టీడీపీ పార్టీ ఎన్నికలో ఘోర ఓటమి ... వీళ్ల రాజీనామాలకు దారి తీసింది. ఆ పార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్రస్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: