భారత్ ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటుందోనని పాక్ లో ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే పైకి ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పాలి. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది.
ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో ... పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది.