వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ నారా లోకేష్ పై మండిపడ్డారు. ట్విట్టర్ లో రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ టీడీపీ నేతలు, నారా లోకేష్ చేసే డ్రామాలాపై ఫైర్ అయ్యాడు. పేదలకు కడుపు నిండా నాణ్యమైన అన్నం పెట్టాలన్న ఆశతో ప్రాజెక్ట్ ప్రారంభిస్తే దాన్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు.'' అంటూ నారా లోకేష్ ని జత చేసి ట్వియిట్ చేశారు.                           


అయితే ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు ''సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో వుండే సంచులను తీసుకొని అందులో ఆ గడ్డ కట్టిన బియ్యాన్ని వేసి టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఎత్తులు ...పొత్తులు....చిత్తులకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారే.'' అంటూ టీడీపీ నేతలపై దుమ్ము ఎత్తి పోస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: