గెలుపు ఓటమి అనేవి బాబుగారికి కొత్త కాదు.. నిజానికి ఓడిపోయాకే ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. అయితే జగన్ ప్రభుత్వం పై ఈ మధ్య బాబు పదునైన ఆరోపణలను చేస్తూ.. తెలుగు తమ్ముళ్ళో  చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీ వంద రోజుల పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని..  ఈ వంద రోజుల పుణ్యమా అని,  'వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాస కేంద్రం' పెట్టాల్సిన అవసరం వచ్చిందని..  అయినా  'బాధితుల పునరావాసనిధి' ఏర్పాటు చేయడం దేశంలో ఎప్పుడయినా జరిగిందా ? అని బాబు తాజాగా చేసిన ఆరోపణ. అలాగే 'గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ? వాస్తవానికి ఎక్కడా జరగలేదు. జగన్ గారే ప్రవేశపెట్టారు. అయితే దీని వల్ల  రూ.9000 కోట్ల పనులు నిలిచిపోయాయి' అని ఇటీవలే ఓ  సీఈఓ కూడా పేర్కొన్నాడు. ఆ డబ్బు నష్టం  ప్రజల మీదే పడుతుందిగా.  పైగా 'వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని' పారిశ్రామికవేత్తలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. అదేవిధంగా  కియా కారు విడుదల కార్యక్రమంలో వైసీపీ ఎంపీ బెదిరింపుల ఫలితంగా 17అనుబంధ పరిశ్రమలు తరలిపోయ్యాయి.  టాక్స్ కట్టలేదని సోలార్ ప్యానెళ్లు పగులగొట్టి, నిర్వాహకులను తుపాకీతో బెదిరించిన ఘటన వైసీపీ వచ్చాకే జరిగిందట. ఇలాంటి పదునైన ఆరోపణలు అయితే బాబు చేస్తున్నాడు గాని.. బాబులో మునపటి  ప్రణాళికలు కనిపించడం లేదు. అందుకే తెలుగుదేశం  పార్టీ నాయ‌కులు, పార్టీని న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి అలుపెరుగ‌ని సేవ‌లు చేసిన కార్య‌క‌ర్త‌లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ  మళ్లీ బాబు సీఎం అవ్వటానికి ఇంకా  అవకాశాలు ఉన్నాయి. ఎడారిలో సైతం  అవసరం అయితే  నీళ్లను  సంపాధించేంత ఓపిక తెలివితేటలు బాబుకు ఉన్నాయి. ఇప్పటికైనా బాబు   ఓట‌మికి గల కార‌ణాల‌ను విశ్లేషించుకుని చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు పై  వ్యతిరేకత తగ్గుతుంది. 


 పైగా ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో  పోస్ట్ చేసి సరిపుచ్చకుండా..  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా చొరవ తీసుకోవాలి. తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి..  అవ‌స‌రం మేర‌కు వారి చేత పార్టీ సిద్దాంతాలను  అమ‌లు చేసే విధంగా ముందుకు సాగాలి. అలాగే  నాయ‌క‌త్వ లోపం లేకుండా..  ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి.  ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ ఇలా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు.  అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా..  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయ‌గ‌ల‌గాలి. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి.  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడా అంశాల‌ను నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో అధినేత స‌మీక్ష‌లు జరపాలి. ఇవన్నీ బాబు ప్రస్తుతం చేస్తున్నారుగా అనకుండా.. ప్రతి ఏరియాలోకి వెళ్లేలా చేసుకుంటూ పోవాలి.  అలాగే  అంద‌రికీ  తమ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు, పార్టీలోని లోటుపాట్లు గురించి ఫిర్యాదు చేసిందుకు  అందరికి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.  ముఖ్యంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.  యువ నాయ‌క‌త్వానికి పెద్ద పీఠ వేయాలి.  ఇలా సందర్భానుసారంగా  మేటి ప్ర‌ణాళిక‌లు వేస్తూ  ముందుకు వెళ్ళితే..  మళ్లీ  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: