వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేధికగా పవన్ కళ్యాణ్ ని ఏకిపారేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ టీడీపీ నేతలపై, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఉద్దానం అంశంపై పవన్‌ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడు. 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ వస్తోంది. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయం. ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది. ‘గాలి’ మాటల నుంచి కాదు. అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి.                           


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఒకొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే మరి కొందరు విజయసాయి రెడ్డికి సప్పోర్ట్ చేస్తున్నారు. కొందరు అయితే ప్రాసలు వాడుతూ సెటైర్లు వేస్తున్నారు. 'జగన్నా'ధుడి 'విజయా'స్త్రం 'పవనా'నికి తగిలినట్లుంది' అంటూ కామెంట్లు చేస్తూ సైటర్లు వేస్తున్నారు.                          


మరింత సమాచారం తెలుసుకోండి: