కామా తురానాం..నభయం న లజ్జ అన్న చందంగా సాగుతుంది ఈ మద్య కొంత కామంధులు అత్యాచారాలు.  పెరిగిప పరిసరాలే కావొచ్చు..సెల్ ఫోన్ ప్రభావమే కావొచ్చు..మత్తు తో చేస్తున్న అకృత్యాలే కావొచ్చు దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రస్తుతం మహిళలు బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్న దౌర్భాగ్యం నెలకొంది. ఈ మద్య రక్షణ కల్పించాల్సిన తండ్రే కీచకుడుగా మారాడు. కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ విషయం అనంతపురం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. 16 సంవత్సరాల కూతురు  ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తాగుడుకు బానిస్తెన అతను నాలుగు సంవత్సరాలుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.  తల్లి బయటకు వెళ్లడం..కూతురుపై అత్యాచారం చేయడం నిత్య కృత్యం అయ్యింది. పాపంపండింది..తండ్రి కీచకత్వాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజాగా  ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విదేశీ మహిళపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన యువతి హాతరస్‌ జిల్లాకు చెందిన ఒక యువకుడిని వివాహం చేసుకొన్నారు. పౌరసత్వం ఇప్పించే పేరుతో ఆమెను తీసుకువెళ్లిన ఇద్దరు పోలీసులు లఖ్‌నవూ, మథురల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులపై కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.  ఇక  విశాఖ నగర పరిధి ప్రహ్లాదపురంలో ఏడేళ్ల బాలికపై బాలుడు(16) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. కొన్నాళ్లుగా చాక్లెట్లు ఎరచూపుతూ అతడు బాలికను లోబరచుకుంటున్నాడు. బాలిక తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇటీవల ఏడవతరగతి చదువుతున్న బాలికను తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలుడు గర్భవతిని చేసిన విషయం తెలిసిందే.  ఇలా మైనర్లు, మేజర్లు కామంతో చెలరేగిపోతున్నారు..సమాజంలో చిన్న పిల్లలను నుంచి పండు ముదుసలి మహిళల వరకు స్వేచ్చగా తిరగలేని పరిస్థితి నెలకొంది.  అయితే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఇలాంటి వారిలో మాత్రం మార్పులు రావడం లేదు.

దేశంలో ఈ పది సంవత్సరాల నుంచి ఇలాంటి దారుణాలు బాగా జరుగుతున్నాయని..విద్యార్థి దశ నుంచి వారి మానసిక పరిస్థితి చదువుపై కాకుండా ఇతరవాటిపై దారి తప్పడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మానసిక శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ లో ఫోర్న్ సైట్ల ప్రభావం కూడా ఈ దారుణాలకు ముఖ్య కారణం అవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: