భారత్ పై అక్కసును వెళ్లగక్కుతున్న పాకిస్థాన్... వివిధ దేశాల్లోని తన రాయబార కార్యాలయాల్లో భారత వ్యతిరేక బ్యానర్లను, పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఇరు దేశాల నుంచి చివ్వట్లు వస్తున్నా…భారత్ పై తన నింధారోపణలు మానుకోవడం లేదు. కుక్కతోక వంకరా..అన్నట్లు తన బుద్దిని మార్చుకోలేకపోతోంది.  అనాటి నుంచైనా భారత్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇటీవల భారత్ జమ్మూకశ్మీర్ లో  ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో భారత్  పై తన అక్కుసు వెళ్లబోసుకొంది. ఇరు దేశాల ముందర నిలబెడతామనుకున్నా..చివరకు తన పంతాన్ని నెగ్గించుకోలేకపోయింది. తద్వారా భారత్ ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని తెగ ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు ఇరాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది. మషాద్ నగరంలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత వ్యతిరేక బ్యానర్లను ఇరాన్ అధికారులు తొలగించారు. రాయబార కార్యాలయం గోడలపై ఉంచిన ఈ బ్యానర్లను ఆగస్ట్ 15వ తేదీ అర్ధరాత్రి బలవంతంగా తొలగించారు. అయితే 'కశ్మీర్ సంఘీభావ దినం' పేరిట పాకిస్థాన్ ఈ బ్యానర్లను ఏర్పాటు చేసింది. అనంతరం, పాకిస్థాన్ చర్యలను ఇరాన్ ఎండగట్టింది. ఇలాంటి పనులు దౌత్యనీతిని దెబ్బతీస్తాయని తెలియజేసింది. ఓ దేశం గురించి ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేయడం దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమని, ఇలాంటి చర్యలకు పాక్ మానుకోవాలని హితవు పలికింది. ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం వద్ద సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా తాము బ్యానర్లు ఏర్పాట్లు చేస్తే... మీ విదేశాంగశాఖ ఎలా స్పందిస్తుందని పాకిస్థాన్  రాయబారిని ఇరాన్ ప్రశ్నలు సంధించింది. దీంతో ఇరాన్ చర్యలతో పాకిస్థాన్ ఒక్కసారిగా కుంగుతింది. బిక్కముఖంతో నోరెళ్ల బెట్టింది. ఎటు పాలుపోక తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఏదైనా ఒక సమాచారాన్ని ప్రదర్శించే హక్కు తమకు ఉందని ఓ లేఖ ద్వారా వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: