అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి నేతలను కొనుగోలు చేసి విచ్చల విడిగా రాజకీయ వ్యభిచారం చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆది నారాయణ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో ఆది అసలు ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవి కోసం వచ్చారు. ఇప్పుడు అధికారం పోయేసరికి బాబును వదిలేశారు. అలాగే ఎన్నికలో పోటీ చేయకపోయిన నెల్లూరు నారాయణకు మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు.
కానీ నారాయణ ఇప్పుడేమో వైసీపీ మీద అసలు విమర్శలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఓకె అంటే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నారాయణ .. టీడీపీ పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలబడి పార్టీకి ఎన్నికల్లో డబ్బు కొరత లేకుండా చూశారు. అయితే రాజధాని ప్రాంతంలో నారాయణకు సుమారు 2000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద ఉన్నట్టు వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ దిశగా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. నెక్స్ట్ టార్గెట్ నారాయణతో కలిపి మొత్తం ఐదుగురు టీడీపీ నేతలు కేసుల్లో బుక్ అవుతారని చెప్పాలి.