మొత్తానికి చంద్రబాబునాయుడు అనుకున్నట్లే వ్యవహారమంతా జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయటం అన్నది మామూలు అయిపోయింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్ళు వైసిపి ఎంఎల్ఏలు, నేతలను పోలీసులు ఇదే మాదిరి హౌస్ అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు టిడిపి వాళ్ళు అలజడులు సృష్టించటానికి ప్లాన్ చేశారంటూ పోలీసులు అరెస్టులు చేశారు.

 

విచిత్రమేమిటంటే అప్పట్లో వైసిపి నేతలు ఏదో చేస్తారన్న అనుమానంతో హౌస్ అరెస్టులు చేసేవారు. చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటన పెట్టుకుంటే ఆ జిల్లాలోని ఎంఎల్ఏలు, నేతలను హౌస్ అరెస్టు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. తమను హౌస్  అరెస్టులు చేయటాన్ని అప్పట్లో వైసిపి నేతలు ఎంత ప్రతిఘటించినా చంద్రబాబు కానీ పోలీసులు కానీ ఏమాత్రం లెక్క చేయలేదు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వాన్ని ఎలా గబ్బు పట్టించాలా అన్న విషయంలోనే చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఏ ప్లాన్ వేసిన ఫెయిల్ అవుతున్నారు. దాంతో లాభం లేదనుకుని వైసిపి బాధితుల శిబిరం అంటూ హడావుడి మొదలుపెట్టేశారు. సరే ఎలాగూ చంద్రబాబు ఏమి చేసినా గుడ్డెద్దులాగ మద్దతిచ్చే ఎల్లోమీడియా ఉంది కాబట్టి మరింతగా రెచ్చిపోతున్నారు.

 

ఈరోజు గుంటూరు జిల్లాలోని చలో ఆత్మకూరు విలేజ్ కార్యక్రమాన్ని ఉద్రిక్తంగా మార్చాలని చంద్రబాబు గడచిన వారం రోజులుగా అనుకుంటున్నారు. అనుకున్నట్లుగానే తన మీడియా బలంతో గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలకు ఏదో జరిగిపోతోందనే భ్రమను జనాల్లో కల్పించగలిగారు.

 

దానికితోడు టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయటంతో చంద్రబాబు ప్లాన్ బాగానే వర్కవుటయ్యింది. ఉదయం 8 గంటలకు చంద్రబాబు కరకట్ట మీద నుండి ఆత్మకూరుకు బయలుదేరాలని అనుకున్నారు. అలాగే లోకష్ ను కూడా తన ఇంటికి దగ్గర లోనే అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుండి చంద్రబాబును పోలీసులు బయటకు రానీయకపోవచ్చు. మొత్తానికి చంద్రబాబు అనుకున్నట్లే జరుగుతోంది అంతా.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: