పసిడి ధర మళ్లీ పడిపోయింది. మొన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ దిగి వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గి రూ.39,770కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీయ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 తగ్గిపోయి రూ.36,450కు క్షీణించింది. బంగారం ధర పడిపోగా.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతూ రూ.53,200 వద్ద నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గిపోయి రూ.38,400కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.37,200కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.53,200 వద్దనే కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌ కు 0.05 శాతం పెరుగుదలతో 1,499.45 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.05 శాతం తగ్గి 18.17 డాలర్లకు చేరుకుంది.

 

 

బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపే అంశాలు మార్కెట్ లో చాలానే ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: