పల్నాడులో రాజకీయ చిచ్చు రాజుకుంది . వైసీపీ బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరు కు పిలుపునిచ్చిన  నేపథ్యంలో రాష్ట్రంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చలో ఆత్మకూరులో పాల్గొనేందుకు బయల్దేరిన నేతలను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. 


ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చలో ఆత్మ కురు పై సంచలనం వ్యాఖ్యలు చేస్తూ తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు . చంద్ర బాబు చలో ఆత్మకూరు పేరుతో డ్రామా చేస్తున్నాడని ...యరపతనేని శ్రీనివాస్ రావు ,కోడెల శివప్రసాద్ రావు , దూడల లను రక్షించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఇదంతా డ్రామా సృష్టిస్తున్నాడని విమర్శించారు. పల్నాడులో చలో ఆత్మకూరు పేరుతో రచ్చ చేసి ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త పరిశ్రమలు రాకుండా చేసేందుకు ...చంద్రబాబు నాయుడు దొంగల ముఠా ప్రయతినిస్తోందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో పల్నాడులో రౌడీ రాజ్యం ఏలింది . రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టంలేదు అందుకే ఇలా చేస్తున్నారంటూ విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా టీడీపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేయిస్తూ ...రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా వ్యవహరిస్తుందని  వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు . అసలు  ఏనాడూ పల్నాడుని పట్టించుకోని బాబు ... జగన్ పల్నాడులో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే చలో ఆత్మ కురు పేరుతో రచ్చ చేస్తున్నారని విమర్శించారు .జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయినా మూడు నెలల్లోనే పల్నాడుకు మెడికల్ కాలేజీ మంజూరు చేసారని ...పల్నాడులో ప్రశాంత మైన వాతావరం నెలకొల్పి, అభివృద్ధి చేసేందుకు  వైసీపీ ప్రభుత్వం ప్రయతినిస్తుంటే ...చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: