విద్యాబుద్దులు నేర్పవలసిన పంతుల్లు ఈ మధ్య కొందరు స్కూల్కెళ్లి ఏం చేస్తున్నారో తెలుసా,ఏంచక్కా శృంగార పాఠాలు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారా కాదు వారే నేర్చుకుంటున్నారు.సరసాలకోసమే స్కూళ్లు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఇలాంటివాళ్ల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధులు రేపు దేశాన్ని బాగా ఉద్దరిస్తారనే మాట పక్కన పెడితే సమాజానికి చెడుచేయకుంటే చాలు..ఇకపోతే తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని పాఠశాల మరుగుదొడ్డిలో మహిళతో రాసలీలలు చేస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.ఇంత ఘనకార్యం చేసిన ఘనుడు ఎవరో,ఎక్కడివాడో తెలుసుకుందాం..
తమిళనాడులోని నామక్కల్ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్ ఉడుంబం అనే గ్రామంలో వున్న ఎలిమింటరీ పాఠశాల ఉపాధ్యాయుడు శరవణన్కు,ఇక్కడికి పక్కనే ఉన్న అంగన్వాడి పాఠశాలలో పనిచేస్తున్న మహిళకు అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం.వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నట్టు గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పినారట.దీంతో మాటువేసి అతన్ని పట్టుకోవాలని చూసిన పిల్లల పేరెంట్స్కు అతను రెడ్ హాండ్గా దొరికాడు.తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని,ఉపాధ్యాయుడు శరవణన్ను పట్టుకుని పాఠశాలలో మహిళతో ఉన్న విషయం నిలదీయగా అతను దురుసుగా సమాధానం చెప్పడంతో అక్కడున్న మహిళలు చెప్పులు,చీపురలతో శరవణన్ను చితకబాది బడితేపూజ చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు.
ఈ విషయాన్ని,పాఠశాల హెడ్మాస్టర్ జయరాజ్ దృష్టికి తీసుకెళ్లగా అతను మాట్లాడుతూ,గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్ ఒక మహిళతో పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్నట్టు తనకు తెలిసిందని,అయితే తాను అక్కడికి వెళ్లే సరికి మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉన్నాయని, అయినప్పటికీ ఆ తాళాలు తీసి లోపలికి వెళ్లి చూడగా మహిళ ఉన్నట్టు తాను చూసానని తెలిపారు.అయితే అప్పుడు శరవణన్ను హెచ్చరించి పంపించేశామని, తర్వాత అప్పటి నుంచి ఎలాంటి అకృత్యాలు పాఠశాలలో జరగలేదని వివరించాడు. ఇక శరవణన్ను పట్టుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు...