చలో ఆత్మకూరు అటెన్షన్ లో టిడిపికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. టిడిపి నేతలు సహనం కోల్పోయి తమ కోపాన్ని పోలీసులపై చూపిస్తున్నారు. అచ్చెన్నాయుడు ఎస్పీ స్థాయి అధికారిని దుర్భాషలాడడం ఇప్పటికే పెద్ద దుమారాన్ని రేపుతోంది. మరోవైపు టీడీపీ మహిళా నేతలు మహిళా పోలీసులను టార్గెట్ గా చేసుకుని నోరు పారేసుకుంటున్నారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గరికొచ్చిన ఆ పార్టీ మహిళా నేత నన్నపనేని రాజకుమారితో పాటు మరి కొందరు మహిళా నేతలు మహిళా పోలీసుల పై మాటలతో విరుచుకుపడ్డారు.దళితుల వల్లే దరిద్రమంటూ అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు అధికారిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడ్డం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది . టిడిపి మహిళా నేతల కామెంట్స్ తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా ఎస్సై వారి పై రివర్స్ అటాక్ చేశారు .
తాము మీకు దరిద్రమంటూ నన్నపునేనితో సహా మిగతా మహిళా నేతల పై విరుచుకుపడ్డారు . మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా చేసిన నన్నపనేని తనను వేలు చూపిస్తూ హెచ్చరించటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు .తాను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని హెచ్చరించారు మహిళా ఎస్ఐ . టిడిపి చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది .
చంద్రబాబు, లోకేష్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు . చంద్రబాబును కలిసేందుకు వచ్చేటువంటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిని చంద్రబాబు నివాసం గేటు వద్ద లోపలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు . ఈ సమయంలోనే అటు అచ్చెన్నాయుడు గాని, నన్నపనేని రాజకుమారి వాళ్ళు ఇద్దరు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు .