పల్నాడులో లేని సంక్షోభాన్ని సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వైసీపీ కార్యకర్తలు, నేతలను చిత్ర హింసలు పెట్టారని అన్నారు. టిడిపి క్యాడర్ కి ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం పోయిందని, అందుకే బాబు దొంగ డ్రామాలు పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఒకసారి అరవై నెలల తెలుగుదేశం పరిపాలనను గుర్తు చేసుకోండి,అరవై నెలల తెలుగుదేశం పరిపాలనలో మన చూసింది అంటూ ఒక ఫోటోను చూపిస్తూ దాంట్లో ఉన్న వ్యక్తి గురవా చారి అని, ఈ గురవాచార్య అనే వ్యక్తి యరపతి శ్రీనివాసరావ్ చేస్తున్న అక్రమ మైనింగ్ కి ఎదురుగా నిల్చున్న వ్యక్తి అనీ, ఎదురుగా నుంచున్నాడు, కేసు వేశారనే ఉద్దేశంతో ఆయన పైన ఇలా పోలీసులను ఉపయోగించి, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కు మార్పించి చిత్ర హింసలకు గురిచేశారు అని తెలిపారు.

ఏం చంద్రబాబునాయుడుగారు మీ అరవై ఐదు సంవత్సరాల పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో ఏ అక్రమాలు జరగలేదా అని, లేకపోతే ఏ విధంగా మీ పోలీసులను ఉపయోగించి ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి కోరుకుంటున్నా అని ప్రశ్నించారు.

ఇవి సామాన్య కార్యకర్తలు చేసిన పని అని, అలానే తురకపాలెం గ్రామంలో అక్కడున్న మైనార్టీ సోదరులను చిత్ర హింసలు పెట్టారు అనీ కేవలం కార్యకర్తల్నే కాకుండా, నాయకులను కూడా ఉదాహరణకు అంబటి రాంబాబు ఆయన ఎంపీటీసీలను తీసుకుని సత్తెనపల్లి వెళ్తా ఉంటే ఆయనపై దాడి చేసింది అప్పటి మీ ఎమ్మెల్యే కాదా, అలాగే రామకృష్ణారెడ్డిపై లేని పోని కేసులు పెట్టి ఆయనని హింసలకు గురి చేసింది మీరు కాదా అని ఈ సందర్భంగా మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: