వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిరోజు ట్విట్టర్ లో ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ చంద్రబాబు చేసిన చిల్లర విషయాలపై మండిపడ్డాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు 'చలో ఆత్మకూరు' అంటూ ఎదురు దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''గత ఏడాది తన'వాళ్లపై' ఐటి, ఇడిలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సిబిఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు ఎదురు దాడి చేస్తున్నాడు.'' అంటూ ట్విట్ చేసాడు. 


ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు 'చంద్రబాబుపై మండిపోతున్నారు. ఒకరు ట్విట్ చేస్తూ అతని పెయిడ్ ఆర్టిస్టుల గోల పెయిడ్ ఆర్టికల్స్ వరుకు పాకిందని, అయిన ఢిల్లీ లో చంద్రబాబుకి అభిమానులు ఎవరు ఉన్నారంటూ' ప్రశ్నిస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ 'సీబీఐకి ఎందుకు భయపడుతున్నావ్ చంద్రబాబు.. నా మాట విను బీజేపీలో చేరి 'పతివ్రతుడు' అవ్వు.. ఊరికే 70 ఏళ్ళ వయస్సులో నీకు ఈ కష్టం ఏంటి చెప్పు అంటూ చంద్రబాబుకి సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు. మరి విజయసాయి ట్వీట్లకు ప్రతిపక్షం నుంచి ఏలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: