వివాహ బంధం అంటే ఎంత గొప్పదో తెలియనివారు ఉండరు.  అనాధిగా వస్తున్న ఈ ఆచారం రక రకాల పద్దతుల్లో వారి వారి ఆచారాల ప్రకాచం జరుపుతుంటారు..ఏది ఏమైనా భార్యభర్త నూరేళ్ల పాటు పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు.  కానీ ఈ మద్య కొంత మంది వ్యవహారం వివాహబంధానికే మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది.  కేవలం పడక సుఖం కోసం భర్తను భార్య, భార్యను భర్త అతి కిరాతకంగా చంపుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 

తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని ఒకరినొకరు చంపుకోవడమే కాదు..అభం శుభం తెలియని పిల్లను కూడా హతమార్చుతున్న దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  తాజాగా ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా చంపి మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది.  ఐదు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన దొడ్డక ఆంజనేయులు గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆంజనేయులు తన భార్య ఆదిలక్ష్మితో కొంత కాలంగా గొడవ పడుతూ వస్తున్నాడు. అయితే భర్తతో ఇక వేగలేనని ఆదిలక్ష్మమ్మ తన ఇద్దరు కూతుళ్లతో వేరుగా ఉంటుంది.  అయితే  ఆదిలక్ష్మిపై అనుమానం పెంచుకుంటున్న ఆంజనేయులు తన కూతుళ్లతో ఇంటికి వచ్చేమని ఆమెను పదే పదే అడుగుతూ వచ్చాడు. ఇంటికి రమ్మని ఎన్నిసార్లు కోరినా ఆమె ససేమిరా అంటోంది.

ఈ నేఫథ్యంలోనే ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు.  దాంతో ఆదిలక్ష్మికి చిర్రెత్తుకొచ్చి భర్తను  దారుణంగా కొట్టి చంపేసింది..తన గుట్టు బయట పడుతుందని భయంతో మృతదేహాన్ని డంపింగ్ యాడ్ లో పూడ్చేసింది.  తన సోదరుడు కనిపించడం లేదని గురువారం ఆంజనేయులు తమ్ముడు అప్పారావు ఆమె వద్దకు వచ్చి తన అన్న ఏమయ్యాడని నిలదీయగా తనకేంద తెలీదని చెప్పింది. ఆమెపై అనుమానం వచ్చిన అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో భయపడి తన భర్తను చంపేసిన డంపింగ్ యార్డులో పూడ్చేసినట్లు చెప్పింది. పోలీసుల గురువారం ఆంజనేయులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: