ఎవరింట్లోనైన పెళ్లి జరుగుతుందంటే అక్కడ జరిగే సందడికి అడ్డువుండదు.ఇక హడావుడి గురించి చెప్పవలసిన అవసం లేదు.ఒకప్పటి పెళ్లిలకి ఇప్పటి పెళ్లిలకి చాల వ్యత్యాసం వుంది.ఈ కాలం పెళ్లిలు ఎన్నో ఆధునిక పోకడలు సంతరించుకుని డబ్బుకు వెనుకాడకుండా ఆర్భాటంగా జరుగుతున్నాయి.అలా పెళ్లి చేసుకున్న ఓ నవ వరుడు అంతకు ముందే మాదక ద్రవ్యాల మత్తు కు అలవాటైనాడు.సరదాగా మొదలైన వ్యసనం తన భార్యకు తెలియకుండా దాచాడు.ఈ అలవాటు తన భార్యకు తెలిస్తే పరువుతో పాటు,వారి దాంపత్య జీవితానికి ప్రమాదం అనితెలిసి,డీ-అడిక్షన్ సెంటర్ కు పరుగులు తీసాడు.అక్కడికి వెళ్లిన ఆ నవవరుడి చేతులు కాళ్లు కట్టేసి డీ అడిక్షన్ పేరుతో చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది..
చెన్నై రామవరానికి చెందిన సవరిరాజ్ కుమారుడు స్టీఫెన్ చక్రవర్తికి,చెన్నై క్రోంపేట ఉమయాళ్ పురానికి చెందిన యువతితో,గత 8 మే 2019లో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకు,భార్య గర్భవతి అవడంతో తన అత్తగారింట్లో వదలడానికి తన భార్యను స్టీఫెన్ చక్రవర్తి తీసుకువెళ్లారు.ఆమెను అక్కడ విడిచిపెట్టి వెళ్లిన తర్వాత నుండి భర్త వద్ద నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో భార్య ఇంటివారు ఆందోళన చెంది,నేరుగా స్టీఫెన్ చక్రవర్తి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.అయితే అతనికి ఆరోగ్యం సరిలేందున ఆస్పత్రిలో చేర్చామంటూ చక్రవర్తి తల్లిదండ్రులు పొంతన లేని సమాధానాలు చెప్పారు.దీంతో వారితో స్టీఫెన్ ఆచూకీ తెలపాలంటూ అత్తమామలు వాగ్వాదానికి దిగడంతో,గూడువాంజేరిలోని డీ అడిక్షన్ హోంలో ఉన్నట్లు చెప్పారు.వెంటనే అక్కడికి చేరుకున్న యువతి తల్లిదండ్రులకు అక్కడ స్టీఫెన్ చక్రవరిని,డీ అడిక్షన్ హోం నిర్వాహకుడు అబ్దుల్ సలీం చేతులు,కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించారు.వెంటనే స్పందించి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు..దీనిపై ఫిర్యాదు అందుకున్న గూడువాంజేరి పోలీసులు విచారణ జరుపుతున్నారు..