వైవి సుబ్బారెడ్డి కి ...ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే . వైవి సుబ్బారెడ్డి అంటే జగన్ కి అమిత మైన గౌరవం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. జగన్ నిర్ణయం తో సంతోషం వ్యక్తం చేసిన వైవి సుబ్బారెడ్డి ...స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.  అయితే తాజాగా వైవి సుబ్బారెడ్డి ఇంట్లో పూజలు జరిగాయి...పూజలు అంటే కామన్ కదా అంటారా ...ఆ పూజలు చేసింది అఘోరాలు అయితే మాత్రం విచిత్రంగా ఉంటుంది .


తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుండి అఘోరాలు విచ్చేసారు. టీటీడీ చైర్మన్  వైవి సుబారెడ్డి పిలుపు మేరకే అఘోరాలు హిమాలయాలనుండి ఇక్కడికి విచ్చినట్టు తెలిసింది. హిమాలయాల నుండి విజయవాడ చేరుకున్న అఘోరాలు నేరుగా వైవి సుబారెడ్డి ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా  వైవి సుబ్బా రెడ్డి కుటుంబం అఘోరాల కాళ్ళకి నమస్కరించగా...వారు ఆశీర్వచనం అందించారు. కాగా దీనికి సంబందించిన  ఫోటోలు  సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమవగా ...నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 


అయితే అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఖరారు చేస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకోగానే ఎన్నో నిరసనలు జరిగాయి . అసలు వైవి సుబ్బారెడ్డి హిందువే కాదని ఆయన ఒక ముస్లిం, క్రిస్టియన్ అని చాలా మంది నిరసనలు తెలిపారు .ఒక క్రిస్టియన్నీ టీటీడీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని ...టీటీడీ చైర్మన్ పదవి హిందువులకే  ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి . ఎన్ని నిరసనలు జరిగినప్పటికీ చివరికి  వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: