స్వచ్ఛంగా 18 క్యారెట్ల  బంగారంతో చేసిన మరుగుదొడ్డి అది. ఇటలీకి చెందిన మౌరిజియో కాటెలన్‌ దీనిని రూపొందించారు. న్యూయార్క్ లోని సోలోమన్ ఆర్ గుగెన్ హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చారు. లండన్ లోని బ్లనియమ్ ప్యాలెస్ లోని ప్రదర్శనశాలలో కొలువుదీరిన ఈ టాయిలెట్ అపహరణకు గురైంది.  దీన్ని సెప్టెంబర్ 14 న దొంగలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.8.8 కోట్లు ఉండొచ్చని చెప్పారు. అర్ధరాత్రి దుండగులు ప్యాలెస్‌లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే..అమెరికాలోని న్యూయార్క్‌లో సాలమన్‌ గుగ్గెన్‌ హీవ్‌ మ్యూజియంలో ఇటీవలే ఈ బంగారం ముద్దతో ఆకర్షణీయంగా తయారు చేసిన  టాయిలెట్‌ను ప్రదర్శించారు.


 కానీ అది మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. బంగారానికి ఉన్నంత మోజు మరే దాని మీద లేద్దన్నది నగ్నసత్యం. అలాంటి గోల్డ్ కళ్లాపడితే ఏవరు మాత్రం ఊరుకుంటారు. ఇంకేముంది  దొంగలు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి ఎత్తుకుపోయారు. దొంగతనానికి రెండు వాహనాలను వాడారని తేల్చారు. బంగారు మరుగుదొడ్డి దొంగతనం వార్త స్థానికంగా కలకలం రేపింది. దొంగతనం కావడంతో అధికారులు ప్యాలెస్‌ను మూసివేశారు. పర్యాటకులను లోనికి అనుమతించలేదు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. 




బంగారంతో తయారు చేసిన ఈ టాయిలెట్ ను దోచుకుని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయని ఆశపడతారు. గోల్డ్ టాయిలెట్ చోరీ అయ్యింది. అసలే బంగారంతో చేసింది.. ఇక ఊరుకుంటారా.. దొంగలు తమ చేతులకు పని చెప్పారు. అక్టోబర్ 27 వరకు ఈ కళాఖండాన్ని బ్లనియమ్ ప్రదర్శనశాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు. ఇంతలోనే దొంగలు ఎత్తుకుపోవడంతో షాక్ తిన్నారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: