వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించి ఎవరికి ఎలా ఝలక్ ఇవ్వాలో వారికీ ఆలా ఇస్తుంటారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్'పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ 'ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా. ఇసుకును కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా తెలియపర్చండి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది పవన్ కళ్యాణ్ గారికి'అని ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. 'సర్ .. అతనికి ఎం తెలుస్తుంది చెప్పండి. అతనికి ట్రైనింగ్ ఇచ్చింది చంద్రబాబు. ఏమైనా అనాలంటే చంద్రబాబుని అనండి' అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు స్పందిస్తూ 'నటనకి, ప్యాకేజ్ కి పవన్ కళ్యాణ్ ప్రాణం అలవాటుపడిందండి. చంద్రబాబు నాయుడు సక్రమంగా ప్యాకేజ్ ఇచ్చినట్టు ఉన్నాడు. అద్భుతంగా నటిస్తున్నాడు అంటూ ట్విట్ చేశారు మరికొంతమంది నెటిజన్లు. మరి ఈ ట్విట్ పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: